telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని…

kodali nani ycp

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో తీర ప్రాంత ప్రజల పాట్లు చూశారని అందుకే ఈరోజు హార్బర్ లు ప్రారంభిస్తున్నారని అన్నారు. గాలి కబుర్లు చెప్పి గాలికి వదిలేసిన ప్రభుత్వాలు చూశామని కానీ మత్స్యకార రంగాన్ని అన్ని విధాలా సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. చంద్రబాబు ఖాళీగా కూర్చుని 500 మంది రాష్ట్ర కార్యదర్శులు, వెయ్యి మంది ఉపాధ్యక్షులను చేశారని అన్నారు.  ఎవడికి వాడు పిచ్చివాగుడు వాక్కుంటున్నారని ఆయన అన్నారు. ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజానీకం సమస్యలు చూసి మాట్లాడాలన్న ఆయన కానీ పార్టీ ఆఫీస్ లో బ్రోకర్ పనులు చేసుకుంటూ.. పార్టీ ఆఫీస్ లో పేపర్లు మోసుకుంటూ మాట్లాడుతున్నారని అన్నారు.  చంద్రబాబు ఇచ్చే జీతం మీద ప్రెస్ మీట్ కొచ్చి మాట్లాడే వెదవలు ఉన్నారని నాని అన్నారు. వాడెవడో పట్టాభి.. భుట్టాభి అంటున్నారు, ఎక్కడుంటాడో కూడా నాకు తెలియదని అన్నారు. అట్లాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం నాకు  లేదని తెలిపారు.

Related posts