హత్యలకు బీహార్ కేంద్రంగా మారిందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ అజాద్ మండిపడ్డారు. ప్రతి వారం దళితులు, ముస్లింలు హత్యకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సబ్ కా సాథ్… సబ్ కా వికాస్’ ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.నయా భారత్ ను మీ వద్దే ఉంచుకోవాలని, పాత భారత్ ను తమకు ఇచ్చేయాలని అన్నారు.
పాత భారత్ లో ప్రేమ, అభిమానం, సంస్కృతి ఉండేవని చెప్పారు. దళితులు, ముస్లింలు కష్టాలకు గురైతే హిందువులు కూడా బాధపడేవారని అన్నారు. హిందువుల కళ్లలో నలక పడితే, దళితులు, ముస్లింల కళ్లలో నుంచి నీళ్లు వచ్చేవని చెప్పారు. కానీ, నయా భారత్ లో మనుషులంతా ఒకరికొకరు శత్రువుల్లా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ పిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు