telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రాజుకుంటున్న బీజేపీ-టీఆర్ఎస్ వార్…

టీఆర్ఎస్ కామెంట్స్ బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన అన్నారు. ప్రజలు ఏ విదంగా సమాధానం చెప్పాలో ఆ విదంగా చెబుతారన్న ఆయన అసలు భాగ్యనగర్ అని పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి టెంపుల్ పేరు మీద అని అలాంటి భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి ఎందుకు పోకూడదు.. అది ఏమన్నా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉందా ? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలకి సవాల్ విసురుతున్నా ఏ గుడికి రమ్మంటారో చెప్పండి..అని అన్నారు. సీఎం భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి రాకుంటే మక్కా మసీదు కన్నా వస్తాడు అనుకున్న ఎటు కాకుండా అయ్యాడని అయన ఎద్దేవా చేసారు. ఎన్నికల కమిషనరే నాకు ఏ లేఖ రాలేదు అని చెప్పారని అలానే బండి సంజయ్ అనుచరుడి పేరుతో Trs స్క్రిప్టు తయారు చేసింది.. ఆ లెక్క మేము తయారు చేస్తే రోడ్ల మీద తిరగలేరు జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరించారు. మేము లేఖ పై ఫిర్యాదు చేస్తే ఇంత వరకు ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లడుతున్నాడన్న ఆయన జీహెచ్ఎంసీలో గెలిస్తే 25 వేలు వరద సహాయం చేస్తామని అన్నారు. గతంలో ఎవరికన్న 10 వేలు ముట్టాయో వారికి కూడా మేము అదనంగా డబ్బులు ఇస్తామని అయ్యన అన్నారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు దేశ ద్రోహం కాదా.. చైనా కి అనుకూలంగా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. మమ్మల్ని కంట్రోల్ చేసే శక్తి మీకు లేదు.. ప్రజల కంట్రోల్ లో పనిచేస్తామని అన్నారు.

Related posts