telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ముత్తప్ప రాయ్ అంత్యక్రియల్లో గాల్లోకి కాల్పులు: ఆరుగురి అరెస్ట్

Muthaiah roy banglore

బెంగళూరు చివరి అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని అనుచరులు బిడదిలోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన అనుచరులు ఆయన భౌతికకాయానికి గన్ శాల్యూట్ చేశారు. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. కర్ణాటక రామనగర జిల్లా బిడదిలో జరిగిన ఈ ఘటనలో ఘటనలో ఆరుగురు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో బిడది పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ మాట్లాడుతూ, ఆయుధాల చట్టం కింద ఆరుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అందరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Related posts