బెంగళూరు చివరి అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని అనుచరులు బిడదిలోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన అనుచరులు ఆయన భౌతికకాయానికి గన్ శాల్యూట్ చేశారు. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. కర్ణాటక రామనగర జిల్లా బిడదిలో జరిగిన ఈ ఘటనలో ఘటనలో ఆరుగురు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో బిడది పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ మాట్లాడుతూ, ఆయుధాల చట్టం కింద ఆరుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అందరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.