telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ట్రంప్‌ ట్వీట్‌ పై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

pm modi on kargil day

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని భారత్ ఎత్తివేయడంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. ట్రంప్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు.

‘మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్. ఇటువంటి విపత్కర పరిస్థితులు స్నేహితులను మరింత దగ్గర చేస్తాయి. భారత్‌-అమెరికా మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. కొవిడ్‌-19పై చేస్తోన్న పోరాటంలో భారత్‌ వీలైన సాయాన్ని చేస్తూనే ఉంటుంది. మనమంతా కలిసి కరోనాపై గెలుస్తాం’ అని మోదీ ట్వీట్ చేశారు.

అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు భారత్ కు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ చేసిన సాయాన్ని మర్చిపోలేమని, కరోనాపై పోరాటంలో మీ బలమైన నాయకత్వానికి, మానవత్వానికి ధన్యావాదాలు తెలుపుకుంటున్నట్టు ట్రంప్ ఆ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Related posts