telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉదయం 6 నుంచి 11 గంటల వరకే కొనుగోళ్లు: మంత్రి ఆళ్ల నాని

Alla-Nani minister

లాక్ డౌన్ ఆమ్లవుతున్న నేపథ్యంలో నిత్యావసరాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాపారులందరూ ధరల పట్టికను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. రైతు బజార్ల మాదిరిగానే నిత్యావసరాల ధరలు పట్టికలో చూపాలని చెప్పారు.

పట్టికలో ఉన్నదాని కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసరాల కొరత రాకుండా చూస్తున్నామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే కొనుగోళ్లు చేయాలని చెప్పారు. 11 దాటితే ప్రజలు బయటకు రావద్దని సూచించారు.

Related posts