telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మదనపల్లె కేసులో భయంకర నిజాలు.. మొత్తం పెద్ద కూతురు పనే ?

మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం సభ్యులు… ఒకరకమైన మూఢత్వంలోకి వెళ్లిపోయారు. ఉన్మాదభక్తితో కన్నప్రేమను మర్చిపోయారా తల్లిదండ్రులు. కడుపున పుట్టిన పిల్లల్ని… కర్కషంగా చంపేశారు.  అయితే… తాజాగా కూతళ్ల హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన మొత్తానికి పెద్దమ్మాయి అలేఖ్య కారణమని తెలుస్తోంది. రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో బయటకు వెళ్లిన దివ్య.. బయట ఏదో ముగ్గు తొక్కినట్లు దివ్య అనుమానపడింది. మరుసటి రోజు నుంచీ అనారోగ్యం పాలైన దివ్య.. ఆరోజు నుంచీ చనిపోతానన్న భయంలోనే ఉండిపోయింది. దివ్య చనిపోవాలని సపోర్టు చేసిన పెద్దమ్మాయి అలేఖ్య…ఈ నెల 23న భూత వైద్యుడితో తాయెత్తులు కట్టించారు తల్లిదండ్రులు. 24న ఏడుస్తూ ఇంటి మేడపైకి వెళ్లిన దివ్య…24 మధ్యాహ్నం ఒంటి గంటకు వేపాకులతో దివ్యను తల్లిదండ్రులు కొట్టారు. అదే రోజు రాత్రి డంబెల్స్‌తో తలపై కొట్టి చంపారు పద్మజ, పురుషోత్తం. దివ్య హత్య తర్వాత తననూ చంపాలని కోరిన అలేఖ్య.. రూమ్‌లోకి వెళ్లి పూజ గదిలో గుండు కొట్లుకుంది అలేఖ్య. నోటిలో రాగి చెంబు పెట్టుకుని పూజగదిలో కూర్చున్న అలేఖ్యను డంబెల్స్‌తో కొట్టి తల్లిదండ్రులు చంపారు. చెల్లిని తల్లిదండ్రులతో కలిసి చంపిన అలేఖ్య…చనిపోయిన చెల్లిని తీసుకువస్తానని తల్లిదండ్రుల చేతిలో హతమైంది. ఇక పునర్జన్మలపై విశ్వాసమే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Related posts