telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గుట్కా అమ్మకాలు కూడా అరికట్టాలి: సోము వీర్రాజు

Somu Veerraju BJP

ఆన్‌లైన్ రమ్మీని నిషేధించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ నిర్వాహ‌కుల‌కు, ఆడేవారికి జైలు శిక్ష ప‌డుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తమ వల్లే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. అలాగే గుట్కా అమ్మకాలు కూడా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సోము వీర్రాజు ట్విటర్ లో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ప్రజల సొమ్ము దోపిడీ అవడం గురించి సీఎం జగన్ గారి దృష్టికి నేను 2020, మేలో తీసుకొచ్చాను. అలానే గుట్కాని ప్రభుత్వం నిషేధించినప్పటికీ, కిరాణా షాపుల్లో, కిళ్లీ షాపుల్లో బ్లాక్ మార్కెట్ లో గుట్కా దొరకడం గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించాను’ అని సోము వీర్రాజు తెలిపారు.

Related posts