telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య : షాకింగ్ విషయాలు బయటపెట్టిన సుశాంత్ మాజీ అసిస్టెంట్

Sushanth

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని ఇప్పటికే విచారించారు. ఈ కేసులో బీహార్, మహారాష్ట్ర పోలీసులు ఇద్దరూ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు విచారణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)కి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం సిఫారసు చేసింది. కాగా తాజాగా అతని మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంకిత్ మాట్లాడుతూ.. సుశాంత్‌తో మూడు సంవత్సరాలు అతని నీడలా కలిసి ఉన్నానని చెప్పాడు. ఆ మూడేళ్లలో సుశాంత్ భయ్యా ఇంట్లో ఉండగా లోపల వైపు గడియా పెట్టుకోవడం తానెప్పుడూ చూడలేదని చెప్పాడు. బాంద్రాలోని అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ విగత జీవిగా పడి ఉన్న సమయంలో అతని గదికి లోపల వైపు గడియ పెట్టి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంకిత్ బయటపెట్టిన ఈ విషయం కీలకంగా మారింది.

అంతేకాదు, తాను ఆగస్ట్ 2019లో సొంతూరు వెళ్లి తిరిగి వచ్చేసరికి సుశాంత్ వ్యక్తిగత సిబ్బందిని మార్చేశారని, గతంలో పనిచేసిన వారెవరూ లేరని చెప్పాడు. సుశాంత్ దగ్గర కొత్తగా పనిచేస్తున్న బాడీగార్డ్స్ తనను ఇంట్లోకి కూడా అనుమతించలేదని అంకిత్ తెలిపాడు. సిబ్బందిని రియా మేడమ్ మార్చి ఉండొచ్చని తాను భావించినట్లు చెప్పాడు. 2019 సెప్టెంబర్‌లో తనకు ఇవ్వాల్సిన డబ్బును ఇచ్చేసిన సందర్భంలో సుశాంత్‌ను కలిశానని, పూర్తిగా మారిపోయాడని, అతని ముఖంలో నవ్వు లేదని, తీవ్ర మానసిక వేదన కనిపించిందని అంకిత్ చెప్పాడు. సుశాంత్ అకౌంట్‌లో 2019లో రూ.30 కోట్లు ఉన్నాయని, రియా సుశాంత్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసేదని అంకిత్ చెప్పాడు. రియా ఎటువంటి విగ్రహాలు లేకుండా సుశాంత్ ఇంట్లో పూజలు నిర్వహించిందని తెలిపాడు. సుశాంత్ ఎలాంటి మెడిసిన్ వాడే వాడు కాదని పేర్కొన్నాడు.

Related posts