telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నానితో పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి

saipallavi said no to another add chance

నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత నాని వరుసగా సినిమాలు చేసేందుకు సైన్ చేశారు. ఇప్పటికే ‘టక్ జగదీష్’ అనే చిత్రం లైన్‌లో పెట్టిన నాని, రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్‌ కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. లేదంటే ఇప్పటికే సెట్స్‌పై ఉండేది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ల గురించి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. నాని మూడు వైవిధ్య కోణాల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. కథానుసారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు స్థానం ఉందట. మూడూ కీలక పాత్రలేనట. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకుంది చిత్రబృందం. “శ్యామ్ సింగ రాయ్‌”లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ ఉండటంతో సాయి పల్లవి అయితే సెట్ అవుతుందని భావించి చిత్ర బృందం ఆమెకు ఓకె చెప్పిందట. కథానుసారంగా ఈ చిత్రంలో హీరోయిన్ పల్లెటూరు అమ్మాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఫిదా చిత్రంలో మాదిరిగా సాయి పల్లవి ఈ చిత్రంలో కనిపించబోతుంది అనేది టాక్. నాని సాయి పల్లవి జంటగా గతంలో నటించిన ఎంసిఏలో నటిాంచారు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించాడు.

Related posts