శ్రీకాంత్ బిరోజు, గీతికా రతన్ జంటగా సంజయ్ కర్లపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘నువ్వుంటే నా జతగా’. సుమ కర్లపూడి, రామకృష్ణ బలుసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తను స్వయంగా రచించిన ‘ద కర్స్డ్ కపుల్’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు కర్లపూడి సంజయ్ తెలిపారు. 2007లో వారణాసిలో ఈ సినిమా కథ మొదలవుతుంది. రామ్ అనే అబ్బాయి, భూమి అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితుల కారణంగా ఎలాంటి వేదనను అనుభవించారనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. జ్ఞాని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చగా, సుకుమార్ అల్లు సినిమాటోగ్రఫీని అందించారు. ట్రైలర్ కు మంచి అప్లాజ్ వస్తోందని, సినిమా కూడా ట్రైలర్ మాదిరిగానే రిచ్ గా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ‘నువ్వుంటే నా జతగా’ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.