telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

పోలీసుల నుంచి వెపన్స్ లాక్కున్నారు: సీపీ సజ్జనార్

cp sajjanar on disa accused encounter

దిశ హత్య కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఈ రోజు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దిశను హతమార్చిన చోటే ఈ నలుగురు హంతకులను హతమార్చారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది పోలీసులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.

పోలీసుల నుంచి ఆరిఫ్, చెన్నకేశవులు వెపన్స్ లాక్కున్నారని… మిగిలిన ఇద్దరు నిందితులు పోలీసులపై రాళ్లు రువ్వారని చెప్పారు. పోలీసులు హెచ్చరించినా వారు వినలేదని అన్నారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారని అనంతరం చూస్తే నలుగురూ చనిపోయి కనిపించారని చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని సజ్జనార్ తెలిపారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.15 వరకు ఈ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. ఈ నలుగురూ కరుడుగట్టిన నేరస్తులని పేర్కొన్నారు. 

Related posts