telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తికరంగా “మిషన్ మంగళ్” టీజర్

Mission-Mangal

ప్రముఖ సైంటిస్ట్ రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతీష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా “మిషన్ మంగళ్”. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో రాకేష్ ధావన్ పాత్రను పోషిస్తున్నాడు. జగన్ శక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2013లో భారత్ చేపట్టిన “మంగళ్‌యాన్‌‌” మిషన్ నేపధ్యంలో సాగే సినిమా ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. “మంగళ్‌యాన్‌” ప్రయోగం చేపట్టే సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలతో ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో విద్యాబాలన్ కీలక పాత్ర పోషించింది. తాప్సి, నిత్యా మేనన్‌, సోనాక్షి సిన్హా, శర్మన్‌ జోషి, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‌అదే రోజున ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సాహో” కూడా విడుదల కానుంది. రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. మీరు కూడా “మిషన్ మంగళ్” టీజర్ ను వీక్షించండి.

Related posts