“భాగమతి” చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అనుష్క నటిస్తున్న తాజా చిత్రం “సైలెన్స్”. ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటించనుండగా, అంజలి, షాలినిపాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడసన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తెలుగులో ఈ చిత్రం “నిశబ్ధం” పేరుతో విడుదల కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంది. అనుష్క శెట్టి నటిగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నిశ్శబ్దం’ టైటిల్ ప్రచార చిత్రం విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని చిత్ర నిర్మాతలు తెలియజేసారు. అమెరికాలోని సియాటల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్లోనే జరగనుంది. చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల, కోన వెంకట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ మరియు మలయాళం.. ఈ 5 భాషల్లో ఈ సంవత్సరం చివరిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల అనుష్క ఇన్స్టాగ్రామ్ ద్వారా తన లుక్ని కొద్దిగా రివీల్ చేసిన విషయం విదితమే. పూర్తి లుక్ని త్వరలో విడుదల చేస్తామని పేర్కొంది. ప్రీ లుక్లో అనుష్క షార్ట్ హెయిర్తో చేతిలో బుక్ పట్టుకొని రాస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయనున్నారు.
previous post
కీర్తి సురేష్ తాజా లుక్ పై వర్మ కామెంట్స్