telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోహన్ బాబు నోట విఘ్నేశ్వరుని కథ… వీడియో

Mohan-Babu

ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో దేశవ్యాప్తంగా ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది వినాయక చవితి పండగను దేశమంతా ఘనంగా జరుపుకుంటుంది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా విఘ్నేశ్వరుని సంబరాలు లేకుండా పోయాయి. తాజాగా ఆ విఘ్నేశ్వరుని కథను సవివరంగా, సంపూర్ణంగా చెప్పి ఆకట్టుకున్నారు డాక్టర్ మోహన్ బాబు. ”నేను చదవడం, వినడం దగ్గరినుంచి ప్రతి సంవత్సరం నేను ఇష్టపడే పండుగలు చాలా ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలను చదివి, వినాయక కథను వినిపించడం నాకు అలవాటు. అయితే ఈ ఏడాది ఈ వినాయక కథను మీ అందరికీ వినిపించాలని నా పెద్ద కుమారుడు విష్ణు వర్ధన్ బాబు కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుని కథను వినిపిస్తున్నాను. శుభంబు యార్” అంటూ స్టార్ట్ చేసిన మోహన్ బాబు విఘ్నేశరుని కథను ఎంతో మాధుర్యంగా, అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అలాగే ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి అందరి ముందుంచారు.

ఇక మోహన్ బాబు ఆగష్టు 15 (74వ స్వాతంత్య్ర దినోత్సవం) సందర్భంగా తన కొత్త సినిమా ”సన్ ఆఫ్ ఇండియా”ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. దేశభక్తి ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

Related posts