దుబ్బాక ఉప ఎన్నిక ఉదయమే ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే..సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ ద్వారా స్పందించారు. ఈ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నారు అని తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారని తప్పుడు వార్తలను టీఆరెస్-బీజేపీ చేసిందని తమకు అనుమానంగా ఉందని మండిపడ్డారు. ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమొద్దని కోరారు. ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటు వెయ్యాలని తెలిపారు.తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి బుద్ధి చెప్పి.. కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని కోరారు. హరీష్ రావు – రఘునందన్ దగ్గర బంధువులు వాళ్ళే కావాలని కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు దుబ్బాకలో 16 శాతం పోలింగ్ అయింది.
previous post