telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కళాసిగూడ నాలాలో బాలిక మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

బాధిత కుటుంబానికి అక్కడి కక్కడే 2లక్షల ఎక్స్ గ్రేషియో ను ప్రకటించిన మేయర్

బేగంపేట్ సర్కిల్ పరిధిలోని కళాసిగూడ నాలాలో బాలిక మృతి సంఘటన సమాచారం తెలిసిన వెంటనే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని మేయర్ పరామర్శించారు. ఘటన పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…  ఈ ఘటన దురదృష్టకరమైనదని మేయర్ విచారం వ్యక్తం చేశారు. వాటర్ వర్క్స్ పనులు జరుగుతున్న నేపథ్యంలో గుంతలను పూడ్చడానికి వాటర్ వర్క్స్ అధికారులు సమయాన్ని కోరారు. అకాల వర్షాల కారణంగా ఘటన చోటుచేసుకోవడం విచారకరం. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  ఈ సందర్భంగా సంఘటన స్థలాన్ని మేయర్ పరిశీలించారు.


బాలిక బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, అందుకు రూ.2 లక్షల రూపాయల ఎక్స్ గ్రెషియా ను అక్కడి కక్కడే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు.

Related posts