telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మన గురుకుల విద్య దేశానికే ఆదర్శం: మంత్రి నిరంజన్ రెడ్డి

niranjanreddy minister

మన గురుకుల విద్య దేశానికే ఆదర్శమని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న టీ-10 క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాముఖ్యతనివ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, అందుకనుగుణంగా అనేక గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో పాటు విద్య, క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి అన్నారు. ప్రతి మహిళా క్రికెటర్ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఫేమస్ క్రికెటర్ మిథాలీరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

Related posts