telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మానవ మృగాలను ఉరితీయాలి.. దిశ ఘటనపై చంద్రబాబు

chandrababu fire on AP CS again

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు. కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసు లో మానవ మృగాలను ఉరితీయాలని అన్నారు. నాగరిక ప్రపంచం అసహ్యించుకునే విధంగా, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేయడం ఎంత దారుణమని అన్నారు. 

మృగాల కన్నా హీనంగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటనలపై ప్రతిఒక్కరూ స్పందించాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గులు ఈ గడ్డపై వుండడానికి వీలు లేదని, ఉరేస్తే తప్ప మిగిలినవాళ్లు భయపడరని అభిప్రాయపడ్డారు. మానవ మృగాలు సమాజంలో ఉండకుండా కట్టడి చేయాల్సిన అవసరం వుందని చెప్పారు.

Related posts