దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు. కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసు లో మానవ మృగాలను ఉరితీయాలని అన్నారు. నాగరిక ప్రపంచం అసహ్యించుకునే విధంగా, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేయడం ఎంత దారుణమని అన్నారు.
మృగాల కన్నా హీనంగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటనలపై ప్రతిఒక్కరూ స్పందించాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గులు ఈ గడ్డపై వుండడానికి వీలు లేదని, ఉరేస్తే తప్ప మిగిలినవాళ్లు భయపడరని అభిప్రాయపడ్డారు. మానవ మృగాలు సమాజంలో ఉండకుండా కట్టడి చేయాల్సిన అవసరం వుందని చెప్పారు.