తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. సమ్మెపై ప్రభుత్వ వైఖరికి తీవ్ర మనస్తాపానికి గురై మహిళా కండక్టర్ నీరజ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో ఆమె విధులు నిర్వహిస్తుంది.
నీరజ మరణ వార్తతో ఆర్టీసీ కార్మికుల్లో విషాదం నెలకొంది. మరోవైపు ఆమె బలవన్మరణం నేపథ్యంలో ప్రభుత్వంపై ఆగ్రహించిన కార్మికులు.. సత్తుపల్లి డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ఇక ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. సమ్మె ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆత్మహత్యాయత్నం చేశారు.