మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభ బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ తరఫున పోటీలో దిగనున్నారు. మన్మోహన్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా గెలిచే సీటు నుంచే ఆయన్ను బరిలోకి దింపాలని కూడా పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.
రాజస్థాన్, యూపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలును ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లో బీజేపీ ఎంపీ మదన్ లాల్ సైనీ కన్నుమూయడంతో, యూపీలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్, బీజేపీలో చేరి రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలూ ఖాళీ అయ్యాయి. మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా 1991 నుంచి సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చారు. నాడు పీవీ నరసింహారావు తన క్యాబినెట్ లో మన్మోహన్ ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.