తెలంగాణలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రాద్రి జిల్లా సరిహద్దు ప్రాంతంలో నక్సల్స్ మందుపాతర పేల్చారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చర్ల మండల పరిధిలోని తిప్పాపురం సమీపంలో మావోయిస్టులు అక్కడున్న కల్వర్టు కింద మందుపాతర పెట్టి పేల్చేశారు . ఆ మార్గంలో పామేడు నుంచి చర్లకు వస్తున్న ఉపాధ్యాయులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఉపాధ్యాయులు వెళ్లిన తర్వాత పేలుడు సంభవించింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.
previous post