telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో నిన్న 162 కరోనా కేసులు నమోదుకాగా తాజాగా గడిచిన 24 గంటల్లో 207 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఇద్దరు కరోనాతో మృతి చెందారు. 239 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ర్ట వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బారిన పడినవారి సంఖ్య 6,66,753కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 3923 మంది మృతిచెందారు. ప్రస్తుతం తెలంగాణలో 4,421 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,135 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

Related posts