ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు విద్యుత్ బల్బులను ఆపివేసి దీపాలను, టార్చ్లను వెలిగించారు. 9 నిమిషాల పాటు ఈ దీపాలను వెలిగించి కరోనా చీకట్లను తరిమికొట్టారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు దీపాలు పట్టుకుని నిలబడ్డారు. అలాగే, స్టైలిష్ అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో దీపాలు వెలిగించారు. అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. విక్టరీ వెంకటేష్ దీపాలను లాంథర్లో పట్టుకుని బాల్కనీలోకి వచ్చారు. నాగార్జున తన భార్య అమల, కుమారుడు అఖిల్తో కలిసి దీపాలను వెలిగించారు.
#LightForIndia #9PmFor9Minutes #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/n2e90soX8p
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 5, 2020
వరుణ్ ధావన్కు ఇద్దరు హీరోల వల్లే కష్టాలు…!?