telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

భారత జవాన్ ను .. కర్కశంగా హతమార్చిన ఉగ్రవాదులు .. సెలవులపై ఉన్న జవాన్లే లక్ష్యం..

terrorists killed a jawan in j & k

ఉగ్రవాదులు మరోసారి జమ్ముకశ్మీర్‌లో ఘాతుకానికి పాల్పడ్డారు. సెలవులో ఉన్న ఓ జవాన్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. కశ్మీర్‌ ప్రాంతంలోని సైనికుడి స్వగ్రామమైన వార్‌పొరలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్‌ రఫీ అనే జవాన్‌ ఉత్తర కశ్మీర్‌లోని 52 రాష్ట్రీయ రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చారు. ఓ ఉగ్రవాది రఫీ ఇంటి వద్దకు చేరకుని ఆయనపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే జవాన్‌ను ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. గత జూన్‌ నుంచి సెలవులపై ఉన్న జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు హత్యలకు పాల్పడుతున్నారు.

Related posts