చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ మన భారత్ లో కల్లోలం సృష్టిస్తుంది. కరోనాను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ విజృంభణ మాత్రం ఆగట్లేదు. దేశ వ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో, కర్ఫ్యూ, లాక్ డౌన్ లు విధిస్తున్నారు. కరోనా పట్ల ప్రభుత్వాలు, ప్రముఖులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వున్నారు. కాగా కరోనా మహమ్మారి విస్తృతిని నిలువరించడానికి గో మూత్రం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని.. దానిని ప్రతిరోజూ తాగాలని ఉత్తరప్రదేశ్లోని బైరియా నియోజవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ పిలుపునిచ్చాడు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని.. ప్రతిరోజు ఉదయాన్నే రెండు లేదా మూడు మూతల గోమూత్రాన్ని ఒక గ్లాసు నీళ్లలో కలుపుకొని తీసుకోవాలని తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉండటానికి అదే కారణమని చెప్పాడు. అయితే చూడాలి మరి దీని పై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనేది.
next post