telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నయనతారకు షాకిచ్చిన “సైరా”

Nayanathara

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. అయితే ఈ సినిమాలో నయనతారకు అన్యాయం జరిగింది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే అద్భుత నటి. ఆమె ఇది వరకు చేసిన ప్రతి సినిమాలో నయనతార నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.శ్రీరామరాజ్యంలో సీత పాత్ర చేసి.. అచ్చం సీత అంటే ఇలాగే ఉంటుందా? అని ప్రేక్షకులు ఆమె నటనకు ముగ్ధులైపోయారు. సింహ సినిమాలో ఆమె నటనకు జేజేలు కొట్టాల్సిందే. వాస్తవానికి ఏదైనా సినిమాలో నయనతార ఉందంటే.. కచ్చితంగా ఆమె హైలైట్ అవుతుంది. ఒకానొక సందర్భంలో హీరోను సైతం డామినేట్ చేసే సత్తా ఆమెది. సైరా విషయానికి వచ్చేసరికి మాత్రం.. నయన్‌కు తగిన గుర్తింపు రాలేదట. అందులో నరసింహారెడ్డి (చిరంజీవి) భార్యగా నటించినా.. ఆమెకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదట. వాస్తవానికి సైరాలో ‘లక్ష్మి’ క్యారెక్టర్ చేసిన తమన్నాకు బోలెడంత పేరొచ్చింది. చిరంజీవి తర్వాత తమన్నాకే ఎక్కువ పేరొచ్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైట్లు, డైలాగ్స్,పాటల్లో, డ్యాన్సుల్లో తమన్నా అదరగొట్టేసిందని అంటున్నారు. కానీ ఈ సినిమాలో నయనతార పాత్ర నిడివి తక్కువగా ఉండడమే కాకుండా ఆమె పాత్రకు ప్రాధాన్యతే లేకుండా చేశారని అంటున్నారు. మరి ఈ వార్తలకు చిత్రబృందం ఏం సమాధానం చెబుతుందో చూడాల్సిందే.

Related posts