పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ “పింక్” తెలుగు రీమేక్ “వకీల్ సాబ్”, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. తాజాగా మరో మలయాళ రీమేక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళంలో విజయంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. సీనియర్ హీరో బాలయ్యతో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్మాత ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే కుదరలేదు. దీంతో పవర్స్టార్ పవన్ కల్యాణ్ లైన్లోకి వచ్చారు. ఈ రీమేక్ చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ‘అయ్యప్పన్ కోషియమ్’ మల్టీస్టారర్ చిత్రం. ఈ సినిమాలో మరో హీరో పాత్ర కోసం యంగ్ హీరో దగ్గుబాటి రానాను సంప్రదించారట. ఆయన కూడా దాదాపు ఓకే అనబోతున్నట్టు తెలుస్తోంది. పవన్తో నటించేందుకు రానా కూడా సిద్ధంగానే ఉన్నాడట. అయితే డైరెక్టర్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని వంటి దర్శకుల పేర్లు వినబడుతున్నాయి. మరి ఆ సినిమాను ఎవరు తెరకెక్కించే అవకాశం ఎవరికీ వస్తుందే వేచి చూడాలి.
previous post