ఆర్థిక నేరాల కేసులను వేగంగా పరిష్కరించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జగన్కు భయం పట్టుకుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
దేశంలో 2,500 మంది రాజకీయ నేతల కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిలో 12 ఛార్జ్షీట్లు సీబీఐ కోర్టులో జగన్పై దాఖలు చేసినవేనని ఆయన అన్నారు. కోర్ట్ విచారణకు భయపడి ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ ప్రజలదృష్టిని మళ్లించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గత సర్కారు ఐదేళ్ల పాలనపై విచారణ జరిపిస్తామని వైసీపీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలు చట్ట వ్యతిరేకం కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన చెప్పారు.
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు. పత్రికా హక్కులు అంటూ మాట్లాడే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి బాగా ఆలోచించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.