telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్ తన మాట నిలబెట్టుకోవాలి: కన్నా డిమాండ్

Kanna laxminarayana

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను ఉపేక్షించరాదని అన్నారు. అవినీతి ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి నేతల భరతం పడతామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు తన మాట నిలబెట్టుకోవాలనిఅన్నారు. ప్రస్తుతం ఇసుక మాఫియాకు పాల్పడుతున్న వారిపైనా కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు

Related posts