telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఛత్తీస్‌గడ్‌లో మావోల ఘాతుకం..ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి

naksals encounter

ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. భీజాపూర్‌ జిల్లా కేశ్‌కుతుల్‌ ప్రాంతంలో శుక్రవారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు. ఘటనాస్థలిలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, జూన్‌ మొదటివారంలో దామ్‌తారి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే మవోయిస్టులు ఈ దాడికి తెగబడ్డారని తెలుస్తోంది.

Related posts