ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందానికి కుదుర్చుకుంది. బుధవారం సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలిపింది ఏపీ ప్రభుత్వం.
“జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష” పథకం అమలు కోసం ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. సీఎం జగన్ సమక్షంలో సర్వే ఆఫ్ ఇండియాతో ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా.. ఏలూరు ఘటనపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మధ్యాహ్నం 12.30కు ఏలూరులో ప్రబలుతున్న వింత రోగం పై ప్రత్యేక బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు సీఎం జగన్.
సీఎం పదవి కోసం జగన్ రూ.1500 కోట్ల ఆఫర్: మాజీ సీఎం ఫరూక్