telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి…

TDP-flag

తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి మృతి చెందారు. ఆయన గుండె పోటుతో ఇవాళ మృతి చెందారు. కందుల శివానంద రెడ్డి కడప ఎమ్మెల్యేగా 1989 లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2004 , 2009 లో పోటీ చేసిన కందుల శివానందరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన మృతికి నారా లోకేష్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించాడు లోకేష్.  “కడప జిల్లా రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని ఏర్పరుచుకుని… మాజీ శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీగా, పారిశ్రామికవేత్తగా, విద్యాసంస్థల అధిపతిగా జిల్లా ప్రజలకు ఎంతో సేవచేసిన కందుల శివానందరెడ్డి గారి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.”  అంటూ ట్వీట్ చేసాడు నారా లోకేష్.

Related posts