telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

*ఏపీలో జ‌గ‌న్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..
*ప‌లువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
*సీఎస్‌ సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ ..

ఏపీ ప్రభుత్వం మ‌రోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌గా ఉన్న చదలవాడ నాగరాణి ని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేసింది ప్రభుత్వం.

అలాగే సర్వ శిక్షాభియాన్‌ అదనపు పీడీగా శ్రీనివాసరావు, రైతు బజార్ల సీఈవోగా శ్రీనివాస రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు శ్రీనివాసరావుకు రైతుబజార్ల సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

అలాగే సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయక్‌ను హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయనకు ఆప్కో వీసీ, ఎండీతోపాటు ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా ఉన్న కాటంనేని భాస్కర్‌ను పాఠశాల విద్యా శాఖ పరిధిలోని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌గా బదిలీ చేశారు.

తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కాటంనేని భాస్కర్‌ మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు సైతం నిర్వర్తిస్తారు.

ఇక బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మికి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు

 

Related posts