telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ 2020 లో ఈరోజు మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్  మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఓవర్లోనే ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ కు చేరుకున్న మిగిత వారందరు ధాటిగా ఆడారు. అందులోనూ సూర్యకుమార్ యాదవ్ (51), ఇషాన్ కిషన్ (55) అర్ధశతకాలు చేసిన చివర్లో హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపించాడు. మొత్తం 14 బంతుల్లో 5 సిక్స్ ల సహాయంతో హార్దిక్ 37 పరుగులు చేయడంతో ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. ఇక ఢిల్లీ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసుకోగా అన్రిచ్ నార్ట్జే, మార్కస్ స్టోయినిస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి నేరుగా ఫైన్సల్ కు వెళ్లాలంటే ఢిల్లీ 201 పరుగులు సాధించాలి. ఒకవేళ ఓడిపోతే క్వాలిఫయర్‌ 2 లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండాల్సింది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

Related posts