telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఏపీలో అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించారు. వారిలో ధైర్యం నింపేందుకు కౌలు రైతు భరోసా యాత్రకు ప‌వ‌న్ శ్రీకారం చుట్టారు.

Pawan kalyan rythu bharosa yatra in anantapur visits the families of tenant farmers

ఒక్కో బాధిత రైతు కుటుంబానికి పవన్‌ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని పవన్‌ స్పష్టం చేశారు.

Image

ఇందుకోసం పవన్ కల్యాణ్ ఈ రోజు ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్‌తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

కైలు రైతుల భరోసా యాత్రలో భాగంగా ఆయన ఇటీవల చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు.

Related posts