పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదు బిచ్చం నాయక్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అని విమర్శించారు . నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కల్యాణ్కు లేదని అన్నారు. టీడీపీ దగ్గర 20, 30 సీట్లు అడుక్కు ని జనసేన పోటీ చేస్తుందని ఆరోపించారు
ఇలాంటి వ్యక్తి సీఎం అభ్యర్థి ఎలా అవుతాడని ప్రశ్నించారు. పవన్కళ్యాణ్ని బిమ్లానాయక్ కాదని.. బిచ్చం నాయక్ అనే అంటారని అన్నారు. టీడీపీ వేసే బీక్షం కాకుండా సొంతం కాకుండా పోటీ చేస్తే భీమ్లానాయక్ అని ఒప్పుకుంటానని అన్నారు.
పవన్ కల్యాణ్ అభిమానులు తనపై ఎన్ని ట్రోల్స్ చేసుకున్న తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవులు లేకపోయినా తాము పార్టీ కోసం కష్టపడతామని, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు
గతంలో మంత్రి పదవి ఉంది కాబట్టి.. సింగిల్ ఫోర్స్తో మాట్లాడామని ఇప్పుడు డబుల్ ఫోర్స్ తో వెళ్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా టీడీపీ, జనసేనతో పోరాటం చేసే విషయంలో తగ్గేదే లేదన్నారు అనిల్. తనకు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే అలవాటు కాదని అన్నారు.
వంశీ చెబుతున్న వెబ్సైట్లతో నాకు సంబంధం లేదు: లోకేశ్