telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్వస్థలాలకు వెళ్ళేందుకు వలస కూలీలకు అనుమతి!

labour lockdwon

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలకు ఏపీ సర్కా‌రు ఊరట కల్పించింది. వారిని సొంత గ్రామాలకు పంపేందుకు సిద్ధమైంది. ఇందుకు తగ్గ మార్గదర్శకాలు విడుదల చేసింది. వలసకూలీలు ఎక్కడ ఎంతమంది ఉన్నారో లెక్కించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. నెగెటివ్ వచ్చిన కూలీలను మాత్రమే స్వస్థలాలకు అనుమతించాలని పేర్కొంది. వలస కూలీలు బృందాలుగా ఉంటే ఆ బృందంలో ఒక్కరికి పాజిటివ్‌ వచ్చానా వారంతా ఉన్నచోటే ఉండాలని తెలిపింది. కరోనా నిబంధనల మేరకు వారికి కూడా వైద్యం అందించాలని రవాణా శాఖ స్పష్టం చ్సింది.

నెగెటివ్ వచ్చిన వారికి స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం గ్రీన్‌ జోన్‌లో ఉన్నవారు మాత్రమే తమ సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని తెలిపింది. బస్సులో 50 శాతం సీట్లలో మాత్రమే కూలీలు కూర్చునేందుకు అనుమతి ఇస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ వివరించింది. భౌతిక దూరం పాటిస్తూ కూలీలు కూర్చోవాలని తెలిపింది. సొంతూరికి వెళ్లాక 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది.

Related posts