telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు: మోహన్ బాబు

mohan babu fire on chandrababu
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి మోహన్‌ బాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీ రామారావు చావుకు కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు అని ఆరోపించారు.  ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు  లాకున్నారని  ఆరోపించారు.  టీడీపీ చంద్రబాబుది కాదని మహానటుడు అన్నఎన్టీఆర్‌దని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవటం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకి డ్వాక్రా మహిళలు గుర్తొస్తారు తప్ప మిగిలిన సమయాల్లో గుర్తుకు రారని విమర్శించారు. పసుపు కుంకుమ పేరుతో వాళ్ల డబ్బులు వాళ్లకే ఇస్తున్నాడన్నారు. సరిగ్గా మాట్లాడటం రాని తన కొడుక్కి మూడు మంత్రి పదవులు కట్టబెట్టటం సమంజసమా అని  చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని మోహన్ బాబు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 130  స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు

Related posts