telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏరియా ఆసుపత్రి డాక్టర్ సస్పెండ్.. స్పందించిన చంద్రబాబు

chandrababu fire on AP CS again

విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ రావును రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేసింది. ఈ విషయం పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆసుపత్రిలో మాస్క్ లు, గ్లోవ్స్ కొరత ఉందన్న విషయాన్ని చెప్పిన సుధాకర్ ను  సస్పెండ్ చేయడం షాక్ కు గురిచేస్తోందని అన్నారు.

డాక్టర్ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆయన్ని వైద్య సేవలు చేసే యోథులను ఈవిధంగా అగౌరవపరిస్తే, ఇంకా బాధితులను రక్షించే విషయంలో ‘రిస్క్’ తీసుకుని ముందుండాలని వారిని ఏవిధంగా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో వైద్యులను, హెల్త్ కేర్ సిబ్బందిని కాపాడుకోవాలని సీఎం జగన్ కు హితవు పలికారు.

Related posts