telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమెరికాలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం..ఒక్కరోజే 1,592మంది మృతి

corona vairus

అమెరికాలో క‌రోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశంలో నిన్న ఒక్క‌రోజే 1592 మంది మ‌ర‌ణించారు. గ‌త రెండున్న‌ర నెల‌ల్లో ఒకేరోజు ఇంత మంది మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. అమెరికాలో క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 1,52,320 మంది మృత్యువాత పడ్డారు.

మంగ‌ళ‌వారం కొత్త‌గా 60 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 44,98,343కు చేరాయి. 21,85,894 మంది కోలుకోగా, 21,60,129 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 18,992 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,68,83,791 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా 2,47,579 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య‌ 6,62,481కు చేరింది.

Related posts