telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వెంకయ్యనాయుడిపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: కిషన్ రెడ్డి

Kishan Reddy

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా సరే మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందనే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పని చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా మంచి పాలన అందించాలని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే వైసీపీ కూడా చేస్తోందని విమర్శించారు. మహారాష్ట్రలో పొత్తు ధర్మానికి శివసేన తూట్లు పొడిచిందని, పొత్తు లేకపోతే బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదని తెలిపారు.

మరోవైపు, విశాఖలో వివిధ శాఖల అధికారులతో ఈరోజు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవీఎంసీ అధికారుల పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు హాజరయ్యారు. 

Related posts