సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో ఐటీ మంత్రి లోకేష్ను పోటీ చేయించేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండడంతో ఆయన పార్టీ నేతలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం సీటు చర్చనీయాంశమైంది. పెద్దాపురం సీటును బొడ్డు భాస్కర రామారావుకు కేటాయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో బొడ్డు భాస్కర రామారావును వెంటనే అమరావతి రావల్సిందిగా చంద్రబాబు కబురు పెట్టారు. దాంతో చిన్న రాజప్ప వర్గం తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో చిన్నరాజప్ప సీటుపై చర్చించేందుకు చంద్రబాబుతో భేటీకి ప్రయత్నం చేస్తున్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో జగన్ ఒకటైనా నెరవేర్చారా?: అచ్చెన్నాయుడు