telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి పెరుగుతూ తగ్గుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.78 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నెల రోజుల క్రితం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండేవి. కానీ, ఇప్పుడు కేసులు వందలకు వరకు నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,78,378 కు చేరింది. ఇందులో 8,67,857 లక్షల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,423 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,098 మంది మృతి చెందారు. ఇక జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 13, చిత్తూరులో 42, తూర్పుగోదావరి జిల్లాలో 21, గుంటూరులో 53, కడపలో 09, కృష్ణాలో 32, కర్నూలులో 04, నెల్లూరులో 07, ప్రకాశంలో 08, శ్రీకాకుళంలో 05, విశాఖపట్నంలో 13, విజయనగరంలో 00, పశ్చిమ గోదావరిలో 05 కేసులు నమోదయ్యాయి.

Related posts