telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని కోడెలపై కేసులు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

ఫర్నీచర్ వ్యవహారంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని కోడెలపై కేసులు నమోదు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.హైదరాబాద్ నుంచి ఇక్కడి కార్యాలయం షిఫ్ట్ చేయడంతో ఇక్కడి సీఆర్డీఏ ఫర్నిచర్ ఇచ్చిందని వివరించారు. ఆ ఫర్నిచర్ ను క్యాంప్ ఆఫీసులో కానీ, ఇంటి వద్ద కానీ ఉపయోగించుకునే వీలుందని పేర్కొన్నారు. ఆ ఫర్నిచర్ గురించే ఇప్పుడు రాద్ధాంతం చేశారని ఆరోపించారు.

సెక్రటరీకి, స్పీకర్ కు కోడెల లేఖలు కూడా రాశారని, ఆ ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులకయ్యే మొత్తాన్ని భరిస్తానని కూడా లేఖలో పేర్కొన్నారు. అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని కోడెలపై కేసు బుక్ చేశారని చంద్రబాబు వివరించారు.కోడెల 37 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని, 12 ఏళ్లు మంత్రిగా, 5 ఏళ్లు స్పీకర్ గా అనేక పోర్ట్ ఫోలియాలు నిర్వర్తించారని నాయుడు వివరించారు. అంతటి చరిత్ర ఉన్న కోడెల చేసిన తప్పేంటి అని నిలదీశారు.

Related posts