కోలీవుడ్ హీరో విశాల్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డాడు. తన కొత్త సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. గురువారం ఉదయం చెన్నైలో ‘మార్క్ ఆంటోనీ’ సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా విశాల్ కి గాయాలు అయ్యాయి..
దీంతో వెంటనే విశాల్ ని హాస్పిటల్ కు తరలించారు చిత్ర యూనిట్. గాయపడ్డ విశాల్ ప్రథమ చికిత్స అనంతరం షూటింగ్ నుంచి వెళ్లిపోయాడని, కొద్ది రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకొనున్నాడని సమాచారం.
ఇటీవలే లాఠీ సినిమా షూటింగ్ లో మూడు సార్లు గాయాలపాలయ్యాడు విశాల్. దాని వల్ల సినిమా షూట్ లేట్ అవుతూ వచ్చింది. తాజాగా మరో సినిమా షూటింగ్ లో మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డాడు విశాల్ .
దీంతో సోషల్మీడియా వేదికగా ఈ వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.