పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. జులై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. బాక్సాఫీస్ని షేక్ చేసిన ఈ చిత్రం మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 28న పూరీ బర్త్డే కావడంతో ఆ రోజుతో పాటు సెప్టెంబర్ 27, 29 తేదీలలో చిత్రం థియేటర్స్లో ప్రదర్శితం కానున్నట్టు సినిమా కో ప్రొడ్యూసర్ ఛార్మి పేర్కొంది. ఏపీ, తెలంగాణలలో మొత్తం 10 థియేటర్స్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండని ఛార్మి పేర్కొంది. ఇటీవల చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్తో పాటు, ఉండిపో, దిమాక్ ఖరాబ్ అనే వీడియో సాంగ్స్ విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. వారం రోజుల కింద యూ ట్యూబ్లో విడుదలైన దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ అప్పుడే 2 కోట్ల వ్యూస్ అందుకుంది. నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోతతో ఈ పాట మాస్కు పిచ్చెక్కించింది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్లో సంచలనాలు రేపుతుంది దిమాక్ ఖరాబ్ సాంగ్. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశాడు.
next post