telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రియాంక చోప్రాకు పోలిసుల వార్నింగ్… ఎందుకంటే ?

Priyanka-Chopra

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్‌సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి.. హాలీవుడ్‌లోనూ క్వాంటికో సిరీస్‌లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. ప్రియాంక చోప్రా దాదాపు మూడేళ్ళ‌ త‌ర్వాత హిందీలో “ది స్కై ఈజ్ పింక్” అనే చిత్రంలో న‌టించింది. ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటించారు. ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ప్రియాంక చోప్రాలు 2005లో “దిల్ ద‌ఢ్‌ఖ‌నే దో” అనే చిత్రంతో తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకు రాగా, “ది స్కైజ్ ఈజ్‌ పింక్” వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న‌ రెండో చిత్రం. ఇందులో ప్రియాంక 21 ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న “ది స్కై ఈజ్‌ పింక్‌” చిత్రంలో జైరా వ‌సీమ్ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుంది. ప్రియాంక త‌ల్లిగా జ‌రీనా న‌టిస్తుంది. అక్టోబ‌ర్ 11, 2019న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ ట్రైలర్ లో ఓ సన్నివేశం మహారాష్ట్ర పోలీసులని ఆకర్షించింది. ప్రియాంక, ఫరాన్ తమ కుమార్తె అనారోగ్యం గురించి మాట్లాడుకునే సన్నివేశం అది. వీలైనంత త్వరగా ఏదైనా బ్యాంక్ లో దోపిడీ చేయాలి. లేకుంటే మన పాపకు వైద్యం చేయించడం కష్టం అని మాట్లాడుకుంటారు. ఈ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు సోషల్ మీడియాలో స్పందించారు. ఆ నేరానికి పాల్పడితే సెక్షన్ 393 కింద ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుందని సరదాగా వార్నింగ్ ఇచ్చారు. దీనికి ప్రియాంక కూడా సరదాగానే స్పందించింది. అరెరె మనం ప్లాన్ తెలిసిపోయింది.. ఇప్పుడు ప్లాన్ బి అమలు చేయాలి అని ట్వీట్ చేసింది.

Related posts