ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కతుంది. ఇందులో రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాతో చెర్రీ కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ తరువాత రామ్చరణ్ ఎవరితో సినిమా చేస్తారని సందేహాలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా తరువాత చేసే సినిమా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. కాబట్టి అందరూ రామ్చరణ్ ఎంచుకునే దర్శకునిపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రామ్చరణ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే పుకార్లను నమ్మవద్దని చెర్రీ అన్నారు. ఆ తరువాత మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్తో చర్చలు జరుగుతున్నాయిని టాక్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఓ కొత్త దర్శకుడితో చెర్రీ తన తదుపరి సినిమా చేయనున్నారని, అతడు చెప్పిన కథ బాగా నచ్చడంతో చెర్రీ ఓకే చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరో రామ్ చరణ్ తన తర్వాతి సినిమా ఎప్పుడు… ఎవరితో తీస్తారు అనేది.
previous post
next post
ఇది ప్రజారాజ్యమా.. నియంతల ప్రభుత్వమా?: టీడీపీ నేత గోరంట్ల