మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నాగబాబు కుమార్తె నిహారిక ఇంట్లో రచ్చనిహారిక భర్త చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. గత అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. ఆమె భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త సైతం అపార్ట్మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇరువురి తరుపున ఫిర్యాదులు అందుకున్న పోలీసులు విచారిస్తున్నారు. దీంతో అంతా ఈ గొడవ గురించే చర్చించుకుంటున్నారు. ఉన్నటుండి ఈ షాకింగ్ న్యూస్ ఏంటి? అసలేం జరిగింది అనే దానిపై ఆరా దీస్తున్నారు.
యాంకరింగ్తో కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక హీరోయిన్గానూ వెండితెరపై తన సత్తా చాటింది. అటు హీరోయిన్గా పలు సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఏర్పుర్చుకుంది. వివాహం తర్వాత నిహారిక తన భర్త చైతన్యతో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వ్యక్తిగత విషయాలు, సినిమా విషయాలతోపాటు.. ఆ మద్య మాల్దీవులు, ఇటీవల పాండిచ్చెరి వరకు టూర్స్కు సంబంధించిన విషయాలను నెట్టింట్లో షేర్ చేస్తూ నిహారిక చేసే రచ్చ మాములుగా ఉండదు.
అయితే పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉండవచ్చుననే ప్రచారం సాగినప్పటికీ… ప్రస్తుతం ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఓ వెబ్సిరీస్లో ప్రస్తుతం నిహారిక నటిస్తోంది. నిహారికతో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటిస్తున్నవిషయం తెలిసిందే.